బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన.. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, 15 జూన్ (హి.స.) కాంగ్రెస్ నాయకుల మాటలు బూటకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన చేసిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇక చెత్తబుట్టలో పారేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన
శ్రీనివాస్ గౌడ్


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

కాంగ్రెస్ నాయకుల మాటలు బూటకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన చేసిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇక చెత్తబుట్టలో పారేయాల్సిందేనని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కులగణన ఏదో గొప్పగా చేశామని ఇది దేశానికి రోల్ మోడల్ అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో చెప్పిందేమిటి ?చేసిందేమిటి అని ఆయన ప్రశ్నించారు. కులగణన తప్పుల తడకగా చేశారని .. అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు మూడేనా మంత్రి పదవులు అని నిలదీశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మంత్రివర్గ కూర్పులో ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్దత ఏదీ ? కీలక శాఖలు బీసీల దగ్గర ఎందుకు లేవు? ఏడాదికి రూ.20 వేల కోట్లు బీసీ లకు బడ్జెట్ లో పెడతామని చెప్పి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande