అహ్మదాబాద్, 15 జూన్ (హి.స.)
మూడు రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని నేటి మధ్యాహ్నం గుర్తించారు. రూపానీ రక్తసంబంధీకుల డీఎన్ఏ తో ఘటనా స్థలంలో సేకరించిన శరీర భాగాల డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 11.10 గంటలకు డీఎన్ఏ టెస్టుకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి.
రూపానీ మృతదేహం గుర్తించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. రాజ్కోట్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..