గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. ఉత్తమ్కుమార్ రెడ్డికి హరీశ్రావు లేఖ
హైదరాబాద్, 15 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. గోదావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు ఆయనకు అభినందనలు తెలిపార
హరీష్ రావు లేఖ


హైదరాబాద్, 15 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. గోదావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం - 2014 ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు గోదావరి /కృష్ణా బోర్డుల అనుమతి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం 2014 ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ అంశాన్ని చర్చించడానికి తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని కేంద్ర జల్ శక్తి మంత్రిని కోరాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ కృషిలో బీఆర్ఎస్ మీకు తోడుగా నిలబడుతుందని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande