హైదరాబాద్, 15 జూన్ (హి.స.)
ఎర్రవల్లి వ్యవసాయ క్షేతంలో ప్రమాదవశాత్తు జారిపడడంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలికి గాయాలవగా.. హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిందే.. కాగా ఆదివారం వారు తన నియోజకవర్గ ప్రజలకు యశోద దవాఖాన నుంచి ఒక వీడియో విడుదల చేశారు.
నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం..మీ అందరి దీవెనెలు, ప్రార్ధనలతో కోలుకుంటున్న.. త్వరలో మీ అందరిని త్వరలో కలుస్తా...అనుకోకుండా ఈ నెల 11న బాత్రూమ్లో జారిపడిన ఘటనలో దవాఖానలో చేరడం జరిగింది. వైద్యులు తనకు మేజర్ సర్జరీ చేశారు. సర్జరీ సమయంలో మొదటి గంట తర్వాత తాను గట్టెక్కినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
వైద్యుల సూచనల మేరకు రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలన్నారు, సుమారు నాలుగు గంటలపాటు జరిగిన సర్జరీ కావడం వల్ల తాను కూర్చొవడం, నిల్చునే వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. మీరు నాకోసం పడుతున్న బాధ, చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న పూజలకు తాను అన్ని విధాలుగా ధన్యుడను అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్