సీఎం రిలీఫ్ ఫండ్ అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలి.. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
తెలంగాణ, కొత్తగూడెం. 15 జూన్ (హి.స.) అత్యవసర పరిస్థితిలో సొంత ఖర్చులతో ప్రైవేటు దవాఖానల్లో వైద్యం చేయించుకున్న పేద వర్గాలకు ప్రభుత్వం ద్వారా అందించే ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ప్రతి ఒక్కరు అందుకునే విధంగా సులభతరం చేయాలని, పథకం అమలులో జరుగుతున్న
కొత్తగూడెం ఎమ్మెల్యే


తెలంగాణ, కొత్తగూడెం. 15 జూన్ (హి.స.)

అత్యవసర పరిస్థితిలో సొంత ఖర్చులతో ప్రైవేటు దవాఖానల్లో వైద్యం చేయించుకున్న పేద వర్గాలకు ప్రభుత్వం ద్వారా అందించే ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ప్రతి ఒక్కరు అందుకునే విధంగా సులభతరం చేయాలని, పథకం అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకానికి దరఖాస్తు చేసుకున్న 84మంది లబ్ధిదారులకు రూ.32.25 లక్షల విలువచేసే చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించి మాట్లాడారు.

ఇప్పటివరకు నియోజకవర్గంలో 1505 మందికి రూ.3.16కోట్ల విలువచేసే చెక్కులు అందించామని, 800 మందికి పంపిణీ కావాల్సివుందన్నారు. మరో 310మంది రోగులకు నిమ్స్ దవాఖాన ఎల్వోసీ ద్వారా ముందస్తు వైద్య ఖర్చులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande