హైదరాబాద్, 15 జూన్ (హి.స.) హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్కుంట వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనం అయ్యారు.
ఆదివారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరిపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగి వారికి మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన స్థానికులు డయల్ 100 ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే విద్యుత్ నిలిపివేయించారు. కానీ అప్పటికే ఆ ఇద్దరు కూడా సజీవదహనమైపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్