రక్తదానం మహా ప్రాణదానం.. ఎమ్మెల్సీ రవీందర్రావు
మహబూబాబాద్, 15 జూన్ (హి. స) రక్తదానం మహా ప్రాణదానం వంటిదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. ఆదివారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత
ఎమ్మెల్సీ రవీందర్రావు


మహబూబాబాద్, 15 జూన్ (హి. స)

రక్తదానం మహా ప్రాణదానం వంటిదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. ఆదివారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరై సంగీత దర్శకుడు చక్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంగీత సామ్రాట్ చక్రి మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో అనేక సంగీత కార్యక్రమాలను నిర్వహించి యువతకు స్ఫూర్తిని నింపారన్నారు.

ఆయన అకాల మరణం ఈ ప్రాంత వాసులకు తీరని లోటని పేర్కొన్నారు. చక్రి గతంలో విద్యా భారతి వంటి అనేక స్కూళ్లలో విద్యార్థులకు పాటలు వృద్ధాలను నేర్పించారని, ఈ ప్రాంతంలో చక్రి జన్మించటం ఇక్కడి పట్టణ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను సాధించే విధంగా కృషి చేయాలని యువతకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande