తెలంగాణ, ఖమ్మం. 15 జూన్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. సోమవారం నాడు జరిగే కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని ఆయన వివరించారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో నేడు మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం.. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని.. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు