హైదరాబాద్, 15 జూన్ (హి.స.)
నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తూ ఐదుగురు యువకులు మృతి చెందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ కి ఓ చెందిన కుటుంబం బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి ఈరోజు ఉదయం గోదావరి లో స్నానానికి వెళ్ళి ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందారని సమాచారం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ల వద్దకు నదుల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.ఇటీవల జనవరి లో కొండపోచమ్మ సాగర్ లో ఐదుగురు యువకులు , వారం రోజుల క్రితం మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పడి ఆరుగురు యువకులు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను నదులు ,కాలువలు ప్రాజెక్ట్ ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ ల ,కాలువల వద్ద లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్