తెలంగాణ, పెద్దపల్లి. 15 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకటస్వామి తొలిసారి తన నియోజకవర్గంలోని సింగరేణి ప్రాంతం రామకృష్ణాపూర్ లో పర్యటించాడు. ముందుగా భారీ గజమాలతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఏరియా ఆసుపత్రిలోని కార్మికుని విగ్రహం ఆవిష్కరణ చేసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో బయలుదేరి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీ చిరకాల కోరిక రైల్వే ఫ్లై ఓవర్ వంతెన నెరవేరడం సంతోషంగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు