తెలంగాణ, వరంగల్. 15 జూన్ (హి.స.)
ఇందిరమ్మ కల సహకారమే లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం వారు నల్లబెల్లి మండలంలోని నారక్క పేట, నల్లబెల్లి, రాంపూర్, మేడిపల్లి గ్రామాలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు