న్యూఢిల్లీ, 15 జూన్ (హి.స.)
ప్రపంచంలో టాప్ 20 ధనవంతుల జాబితాలో భారతీయుల ప్రభావం మరోసారి కనిపించింది. బ్లూమ్బర్గ్ 2025 జాబితాలో భారత్ నుండి ముఖేష్ అంబానీ 17వ స్థానం, గౌతమ్ ఆదానీ 20వ స్థానంలో నిలిచారు. ఇక టాప్ 100లో మొత్తం 9 మంది భారతీయులు చోటు దక్కించుకోగా, వీరిలో సావిత్రి జిందాల్, శివ నాడార్, అజీమ్ ప్రేమ్జీ, సునీల్ మిట్టల్ వంటి దిగ్గజులు ఉన్నారు. భారత పారిశ్రామిక రంగం గ్లోబల్ మార్కెట్లో ఉన్న స్థాయిని ఈ జాబితా ప్రతిబింబిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..