తెలంగాణ, నిర్మల్. 15 జూన్ (హి.స.)
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. వీకెండ్ కావడంతో హైదరాబాద్లోని చింతల్కు చెందిన ఓ కుటుంబం గోదావరిలో పుణ్యస్నానాలకు బాసరకు వచ్చింది. దాదాపు18 మంది కుటుంబసభ్యులు బాసరకు వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గోదావరిలో తేలిన ఇసుక మెటల వద్దకు చేరుకు స్నానాలు చేస్తుండగా ఐదుగురు యువకులు గోదావరి నదిలో మునిగి గల్లంతయ్యారు. ఇది గమనించి కుటుంబసభ్యులు, స్థానికులు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు.
అనంతరం మృతదేహాలను భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులను రాకేశ్, వినోద్, మదన్, రుతిక్గా గుర్తించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు