హైదరాబాద్, 15 జూన్ (హి.స.)
కేదారనాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ సమీపంలో కూలిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం మరువకముందే, ఉత్తరాఖండ్లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణించిన ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం.
సాధారణంగా కేదార్నాథ్ యాత్ర సమయంలో హెలికాప్టర్లు ప్రయాణికులను తరలించే ఉద్దేశ్యంతో రోజువారీగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, ఈరోజు ఉదయం గౌరీకుండ్ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పొగమంచు వల్ల హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కూలిపోయినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు