షాకింగ్ ఘటన.. మరో ఎయిరిండియా ఫ్లైట్లో సాంకేతిక సమస్య
కోల్కతా 15 జూన్ (హి.స.) అహ్మదాబాద్ విమాన ప్రమాద సంఘటన మరువక ముందే ఇవాళ మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ హిండోన్ ఎయిర్పోర్టు నుంచి కోల్కతా కు వెళ్లాల్సిన ఎయిరిండియా వ
ఎయిర్ ఇండియా విమానం


కోల్కతా 15 జూన్ (హి.స.)

అహ్మదాబాద్ విమాన ప్రమాద సంఘటన మరువక ముందే ఇవాళ మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ హిండోన్ ఎయిర్పోర్టు నుంచి కోల్కతా కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది సర్వీసును తాత్కాలికంగా రద్దు చేశారు. ఊహించని పరిణామంతో ప్రయాణికులు హిండోన్ ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. వారందరిని కోల్కతాకు తీసుకెళ్లేందుకు ఎయిరిండియా సిబ్బంది మరో ఫ్లైట్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టేకాఫ్కు ముందే సాంకేతిక సమస్య బయటపడటంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande