అమరావతి, 15 జూన్ (హి.స.)
, : ఒకే రోజు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ఉండడంతో ఏదో ఒకటి మార్పు చేయాలని తెలంగాణకు చెందిన అభ్యర్థులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఏపీలో స్థానికేతర కోటా కింద 20% ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడేందుకు తెలంగాణకు చెందిన సుమారు 7వేల మంది దరఖాస్తు చేశారు. తెలంగాణలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ మధ్యలో 9రోజులు టెట్ నిర్వహిస్తుండగా.. ఏపీలో ఈనెల 30వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీ పరీక్ష కేంద్రాలను హైదరాబాద్లోనూ ఏర్పాటు చేశారు. కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ డీఎస్సీ పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా.. మరికొందరికి ఏపీలో కేంద్రాలు ఇచ్చారు. ఈ నెల 20న ఎక్కువ మందికి అటు తెలంగాణ టెట్ పేపర్-1, ఇటు డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు పరీక్ష ఉండడం సమస్యగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ