వడోదర, 15 జూన్ (హి.స.): గుజరాత్లోని వడోదర నగర క్రైస్తవ సమాజ వాలంటీర్లు 120 చెక్క శవపేటికల తయారీకి రేయింబవళ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన మృతదేహాల తరలింపునకు ఎయిరిండియా అధికారులు వీరికి ఈ పనిని అప్పగించారు. శనివారం రాత్రికి 50 శవపేటికలు సిద్ధం అవుతాయని తయారీని పర్యవేక్షిస్తున్న ఆర్దేశ్ రాజ్వాడీ తెలిపారు. వీటి తయారీకి కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసి, ఒక్క రూపాయి కూడా లాభం తీసుకోకుండా ఈ పనిని వాలంటీర్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచిన మృతదేహాలను (అవశేషాలు) ఈ శవపేటికల్లో తరలిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు