తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 15 జూన్ (హి.స.)
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. వేకువ జాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారిలు తీరారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా క్యూలైన్లు నిండిపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు