ఇంఫాల్: 15 జూన్ (హి.స.)మణిపుర్లోని ఇంఫాల్ లోయ పరిధిలోని ఐదు జిల్లాల నుంచి 300కు పైగా రైఫిళ్లు సహా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, సైనిక సంయుక్త బృందాలు సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 328 రైఫిళ్లు, తుపాకులతో పాటు 591 బుల్లెట్ మ్యాగజైన్లు, 10 బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు