అయోధ్య: 15 జూన్ (హి.స.)ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ్ దర్బార్ ఇకపై భక్తుల సందర్శనార్థం అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా శనివారం తెలిపారు. శుక్రవారం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నందున శనివారం సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో పరిమిత సంఖ్యలో టిక్కెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రోజూ ఉదయం 7 నుంచి 11 గంటలు, తిరిగి మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రతి రెండు గంటల స్లాట్కు 300 పాస్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. జిల్లా యంత్రాంగానికి, ట్రస్ట్కు చెరో 150 పాస్లు కేటాయించగా వీటిలో 100 పాస్లు ప్రత్యేక దర్శనం, 50 పాస్లు సులభ దర్శనం ఉన్నాయని తెలిపారు. రామ్లల్లా దర్శనం కోసం జారీ చేసిన పాస్లు మాదిరి దర్బార్ను సందర్శించాలనుకునే వారికి పాస్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 5న రాజహోదాలో సీతా సమేతంగా రాముడు రామ్ దర్బార్లో కొలువుదీరాడు. సీతారాముల విగ్రహాలతో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడి విగ్రహాలనూ ప్రతిష్ఠించారు. రామ జన్మభూమి సముదాయంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు