డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు
అమరావతి, 15 జూన్ (హి.స.)డీఎస్సీ(Dsc) అభ్యర్థులకు ప్రభుత్వం(Government) బిగ్ అలర్ట్ ప్రకటించింది. డీఎస్సీ పరీక్షలు 20, 21న నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే 21న విశాఖ(Visakha)లో యోగా డే(Yoga Day) నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మో
డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు


అమరావతి, 15 జూన్ (హి.స.)డీఎస్సీ(Dsc) అభ్యర్థులకు ప్రభుత్వం(Government) బిగ్ అలర్ట్ ప్రకటించింది. డీఎస్సీ పరీక్షలు 20, 21న నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే 21న విశాఖ(Visakha)లో యోగా డే(Yoga Day) నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ(Pm Modi) పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తులో ఏర్పాట్లు చేస్తోంది. మోడీ రాకకు ముందు రెండు రోజుల నుంచే రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యా్ప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉండనున్నారు. శాంతి భద్రతలు, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు దృష్ట్యా డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేశారు. ఆయా పరీక్షలను జులై 1,2 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్థులు పరీక్షలకు సిద్ధంకావాలని ప్రభుత్వం పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande