కోల్కతా , 16 జూన్ (హి.స.)సిక్కు వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ చెప్పు విసరగా, అది అతడి తలపాగాకు తగిలిందన్న అభియోగంతో దక్షిణ కోల్కతాలో కేసు నమోదైంది. ఈ ఆరోపణను తోసిపుచ్చిన భాజపా.. అది నిరసనలో భాగంగా ఉపయోగించిన పేపర్ కటింగు మాత్రమేనని ఆదివారం పేర్కొంది. ఎఫ్ఐఆర్ కాపీని పాలక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో పోస్టు చేసింది. రాష్ట్ర భాజపా చీఫ్ కూడా అయిన మజుందార్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు