ఇంఫాల్: , 16 జూన్ (హి.స.)మణిపుర్లో ఓ పంటపొలం సాగు విషయంలో కుకీ, మైతేయ్ తెగల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో తూర్పు ఇంఫాల్, కాంగ్పోక్పి సరిహద్దు ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు తెగలు ఒకరిపై ఒకరు రాళ్లు, ఉండేళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. లైతాన్పోక్పికి చెందిన మైతేయ్ రైతులు సద్దు లంపక్ గ్రామంలోని ఓ వరి పొలాన్ని సాగు చేస్తుండటంతో కుకీలు అభ్యంతరం తెలిపారని, దీంతో ఇరు తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు