మణిపుర్‌లో కుకీ, మైతేయ్‌ల మధ్య ఘర్షణ
ఇంఫాల్‌: , 16 జూన్ (హి.స.)మణిపుర్‌లో ఓ పంటపొలం సాగు విషయంలో కుకీ, మైతేయ్‌ తెగల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో తూర్పు ఇంఫాల్, కాంగ్‌పోక్పి సరిహద్దు ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు తెగలు ఒకరిపై ఒకరు రాళ్లు, ఉండేళ్లతో దాడి చేసుకున్నారు.
మణిపుర్‌లో కుకీ, మైతేయ్‌ల మధ్య ఘర్షణ


ఇంఫాల్‌: , 16 జూన్ (హి.స.)మణిపుర్‌లో ఓ పంటపొలం సాగు విషయంలో కుకీ, మైతేయ్‌ తెగల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో తూర్పు ఇంఫాల్, కాంగ్‌పోక్పి సరిహద్దు ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు తెగలు ఒకరిపై ఒకరు రాళ్లు, ఉండేళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. లైతాన్‌పోక్పికి చెందిన మైతేయ్‌ రైతులు సద్దు లంపక్‌ గ్రామంలోని ఓ వరి పొలాన్ని సాగు చేస్తుండటంతో కుకీలు అభ్యంతరం తెలిపారని, దీంతో ఇరు తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయని పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande