ముంబై, 16 జూన్ (హి.స.)భారతీయుల జీవితంలో బంగారం, వెండి లోహాలు కాదు.. అవి కష్ట సమయంలో ఆదుకునే ఆర్ధిక భద్రత.. దీంతో పండగలు, పర్వదినాలు, శుభ సందర్భాల్లో ఏ సమయం, ఏ సందర్భంలోనైనా పసిడిని కొనుగోలు చేస్తారు. అందుకనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా.. దేశీయంగా పసిడి ధర ఆల్ టైం హైకి చేరుకున్నా.. బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. అయితే ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది షాకింగ్ విషయమే.. ఎందుకంటే బంగారం ధరలు చుక్కలను తాకుతూ పెరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వంటి పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. దీని వల్ల సహజంగానే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత వారం దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ.. లక్షకు పైగా చేరుకున్నాయి. ఇప్పటికే గరిష్ట స్థాయికి పసిడి, వెండి ధరలు చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో సోమవారం (జూన్ 14వ తేదీ) ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 3750 పెరిగిన బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల పుత్తడి ధర స్వల్పంగా తగ్గి తులం (10 గ్రాములు) రూ.93,190 వద్ద ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులం రూ.1,01,670 వద్ద ట్రేడవుతోంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, పొద్దుటూరు, రాజమండ్రి, వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.
దేశంలో బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావితం అవుతాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,820కు చేరుకుంది.10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 93,340 గా ఉంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 93,190లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,670లకు చేరుకుంది. ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, కేరళలలో కూడా కొనసాగుతున్నాయి.
భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరలపై ఆధారపడి ఉంటుంది. డాలర్తో పోలిస్తే రూపాయి కరెన్సీ కదలికపై కూడా వెండి ఆధారపడి ఉంటుంది. డాలర్తో పోలిస్తే రూపాయి పడిపోతే, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే వెండి మరింత ఖరీదైనదిగా మారుతుంది. అయితే బంగారం బాటలోనే వెండి నడుస్తూ నేడు స్వల్పంగా తగ్గింది. ఈ రోజు కిలో వెండి ధర వంద రూపాయల మేర తగ్గి రూ. 1,09,900లగా కొనసాగుతోంది. దేశ ప్రధాన నగరాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి