న్యూఢిల్లీ , 16 జూన్ (హి.స.) ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. శనివారం ఒక్కరోజే బ్రెంట్ రకం పీపా (బ్యారెల్) చమురు ధర 13ు పెరిగి 78 డాలర్లకు చేరింది. చమురు ధర గత ఐదు నెలల్లో ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తున్న నేపథ్యంలో.. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచదేశాలకు చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసేయాలన్న ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది. అది జరిగినా.. లేక ఈ ప్రాంతంలో అమెరికాకు మిత్రుడైన సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులకు దిగినా పీపా చమురు ధర 120 నుంచి 150 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని రాబో బ్యాంకు ఇంటర్నేషనల్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ మైఖేల్ ఇవిరీ ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుత ధరతో పోలిస్తే ఇది 103 శాతం ఎక్కువ
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు