కర్నూలు, 16 జూన్ (హి.స.)మట్టి కుండల్లో నీటిని నిల్వ ఉంచడం భారత్లో తరతరాలుగా వస్తున్న అలవాటు. పర్యావరణ హితమైన ఈ పద్ధతిలో నీటిని సహజసిద్ధంగా చల్లబరుచుకోవచ్చు. ప్లాస్టిక్, మెటల్ కంటెయినర్లతో వచ్చే సమస్యలేవీ మట్టి కుండల వినియోగంతో ఉండవు.
కుండల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేని పక్షంలో బ్యాక్టీరియా పేరుకుని అనారోగ్యాలు కలిగే అవకాశం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, కుండల నిర్వహణపై దృష్టి పెట్టాలి. కొత్త కుండ కొనగానే అందులో నీళ్లు పోసుకుని తాగడం కూడా మంచిది కాదు.
అనుభవజ్ఞులు చెప్పే దాని ప్రకారం, కొత్త కుండను ముందుగా కనీసం ఒక రోజు పాటు నీళల్లో నానబెట్టాలి. ఆ తరువాత పీచుతో బాగా కడిగి ఎండలో పూర్తిస్థాయిలో ఆరబెట్టాకే వినియోగించడం ప్రారంభించాలి. నీటిలో నాన బెట్టడం వల్ల కుండలోని సూక్ష్మ రంధ్రాలన్నీ శుభ్రమవుతాయి. ఆ తరువాత ఎండలో పెట్టడం వల్ల సూక్ష్మక్రిములు నశించిపోతాయి.
కొత్త కుండను ఉప్పు లేదా బేకింగ్ సోడా వేసి బాగా తోమాలని కూడా నిపుణులు చెబుతున్నారు. దీంతో, కుండ పూర్తిస్థాయిలో డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇలా కుండను కడిగేందుకు వేడి నీటిని మాత్రమే వాడాలి. బ్రష్తో తోమితే మరింత ఫలితం ఉంటుంది. సబ్బులు, డిటర్జెంట్లు గ్రహించే గుణం మట్టికి ఉంటుంది కాబట్టి వీటిని కుండలు శుభ్రం చేసేందుకు అస్సలు వినియోగించొద్దు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి