దిల్లీ:, 17 జూన్ (హి.స.)కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. బ్రిటన్కు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో ముడిపడిన కేసులో అభియోగపత్రం దాఖలు చేయడానికి గాను రాబర్ట్ వాద్రాను ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. దీని కోసమే మంగళవారం తమ ఎదుట హాజరు కావాలంటూ రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసు ఇచ్చిందని అధికారిక వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ నెల 10నే వాద్రా ఈడీ విచారణకు రావాల్సి ఉంది. తనకు ఫ్లూ సోకిందని, నిబంధనల ప్రకారం కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని పేర్కొంటూ గైర్హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు