దిల్లీ:, 17 జూన్ (హి.స.)ఓ వ్యాపార సంస్థకు న్యాయ సలహా ఇచ్చిన సీనియర్ న్యాయవాది అరవింద్ దాతార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడంపై సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదుల వృత్తిపరమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ఈ చర్య దెబ్బతీస్తుందని, న్యాయ సలహా పొందే పౌరుల హక్కును హరిస్తుందని సంఘం నేతలు విమర్శించారు. అయితే, ఈడీ ఆ తర్వాత నోటీసును ఉపసంహరించుకుంది. అయినప్పటికీ ఈడీ చర్యను న్యాయవాదుల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు