కెనడా చేరుకున్న ప్రధాని మోదీ
దిల్లీ:, 17 జూన్ (హి.స.)మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కెనడా (Canada)కు చేరుకున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ ఈ సదస్సులో పాల్గోనున్నారు. ఈక్రమం
modi


దిల్లీ:, 17 జూన్ (హి.స.)మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కెనడా (Canada)కు చేరుకున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ ఈ సదస్సులో పాల్గోనున్నారు. ఈక్రమంలో సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) కెనడాలో కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. 2015 తర్వాత మోదీ కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి.

కననాస్కిస్‌లో రెండు రోజుల పాటు జరగనున్న జీ7 సదస్సుల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఆరోసారి. ఇందులోభాగంగా జీ7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. జీ7 దేశాలలోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో(AI) అనుసంధానం, క్వాంటమ్‌ సంబంధిత అంశాల గురించి చర్చలు జరపనున్నారు. కాగా.. తిరుగు ప్రయాణంలో భాగంగా ఈనెల 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande