ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు పండు జ్యూస్ తాగితే ఎన్నో లాభాలు!
కర్నూలు, 17 జూన్ (హి.స.)ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు పండు జ్యూస్ తాగడం వలన జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా మలబద్దక సమస్యను కూడా నివారిస్తుంది. మారేడు పండు జ్యూస్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. జీవక్రియ మెరుగు పరచడం లో మారేడు పండు జ్యూస్ ఎంతో
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు పండు జ్యూస్ తాగితే ఎన్నో లాభాలు!


కర్నూలు, 17 జూన్ (హి.స.)ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు పండు జ్యూస్ తాగడం వలన జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా మలబద్దక సమస్యను కూడా నివారిస్తుంది. మారేడు పండు జ్యూస్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. జీవక్రియ మెరుగు పరచడం లో మారేడు పండు జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన మారేడు పండు జ్యూస్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. ఈ జ్యూస్ రోజు తాగడం వలన చర్మం ముడుతలు రాకుండా ,ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.

మారేడు పండులో అదిక ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. మారేడు పండులోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మంపై మంట, వాపు వంటి సమస్యలను నివారిస్తాయి. తద్వారా మొటిమల నుంచి రక్షణ పొందవచ్చు. మారేడు పండులోని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు.

మారేడు పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది వేడి వాతావరణంలో మీ శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందించి బాడీని హైడ్రేట్ చేస్తుంది.

మారేడు పండులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి కాపాడతాయి. అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. మారేడు పండులోని అధిక ఫైబర్ తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande