పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల మూసివేత..
దిల్లీ:, 17 జూన్ (హి.స.)ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్‌ భారీ క్షిపణి దాడులకు పాల్పడుతుండడంతో ఇరాన్‌ తమ గగనతలాన్ని పూర్
పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల మూసివేత..


దిల్లీ:, 17 జూన్ (హి.స.)ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్‌ భారీ క్షిపణి దాడులకు పాల్పడుతుండడంతో ఇరాన్‌ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. లెబనాన్‌, జోర్డాన్‌, ఇరాక్‌లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు మూతపడటంతో (Airports close) వేలాది మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10వేలకు పైగా ప్రయాణికులు ఇరాన్‌ సహా పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు ఓ రిటైర్డ్‌ పైలట్‌, విమానయాన భద్రతా నిపుణుడు జాన్ కాక్స్ పేర్కొన్నారు.

శుక్రవారం ఇరాన్ టెహ్రాన్ శివార్లలో ఉన్న దేశంలోని ప్రధాన ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలను నిలిపివేసింది. శనివారం ఇజ్రాయెల్ టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై బాంబు దాడులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ సైతం తమ దేశంలోని అత్యంత కీలకమైన బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. దీనివల్ల 50వేల మందికి పైగా ఇజ్రాయెల్‌ ప్రయాణికులు విదేశాలలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ దాడులు కొనసాగుతుండడంతో దేశంలోని మూడు విమానయాన సంస్థల విమానాలను లార్నాకాకు తరలించారు. ఇజ్రాయెల్‌ ప్రజలు జోర్డాన్, ఈజిప్ట్‌తో ఉన్న సరిహద్దుల ద్వారా దేశం విడిచి వెళ్లొద్దని ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande