చెన్నై: , 17 జూన్ (హి.స.)సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారశైలి మారలేదని, కలైంజర్ కరుణానిధి పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఇంకా పెండింగ్లోనే ఉంచారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. తంజావూరులో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆ జిల్లాలో రూ.325.96 కోట్లతో పూర్తయిన పథకాలను ప్రారంభించి, రూ.309.48 కోట్లతో చేపట్టనున్న కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు. 2.25 లక్షలమంది లబ్ధిదారులకు సంక్షేమ సహాయాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకుంటూ, వారికి పథకాలు అమలు చేసి పేరుతెచ్చుకుంటున్న డీఎంకే ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక అన్నాడీఎంకే నేత ఎడప్పాడి అదేపనిగా విమర్శలు చేస్తుండగా, మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లా గవర్నర్ వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలకు అడ్డుకట్ట వేస్తున్నారని ఆరోపించారు. తంజావూరుకు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి రాజకీయపరంగా, సాహిత్యపరంగా విడదీయలేని అనుబంధం ఉండేదని, ఆ కారణంగానే ఇక్కడ కలైంజర్ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని శాసనసభలో బిల్లు ఆమోదించి పంపితే గవర్నర్ ఇప్పటివరకూ ఆమోదించకుండా పెండింగ్లో ఉంచారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు