తీవ్ర విషాదం.. కెనడాలో మరో భారతీయ విద్యార్థిని మృతి
హైదరాబాద్, 20 జూన్ (హి.స.) కెనడాలో మరో భారతీయ విద్యార్థిని మృతిచెందింది. కాల్గరీ యూనివర్సిటీలో చదువుతున్న ఢిల్లీకి చెందిన తాన్య త్యాగి ఆకస్మికంగా మృతిచెందింది. ఈ విషయాన్ని వాంకోవర్లోని భారత కాన్సులేట్ జనరల్ గురువారం అధికారికంగా ప్రకటించింది. మృతుర
కెనడాలో విద్యార్థిని మృతి


హైదరాబాద్, 20 జూన్ (హి.స.)

కెనడాలో మరో భారతీయ విద్యార్థిని మృతిచెందింది. కాల్గరీ యూనివర్సిటీలో చదువుతున్న ఢిల్లీకి చెందిన తాన్య త్యాగి ఆకస్మికంగా మృతిచెందింది. ఈ విషయాన్ని వాంకోవర్లోని భారత కాన్సులేట్ జనరల్ గురువారం అధికారికంగా ప్రకటించింది. మృతురాలి కుటుంబానికి భారత కాన్సులేట్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించింది. 'మేము ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాం' అని కాన్సులేట్ ఎక్స్ వేదికగా తెలిపింది.

తాన్య మరణానికి గల కారణం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు కొన్ని నెలల ముందే మరో భారతీయ విద్యార్థిని సుడిక్షా కోనంకి, మిస్సింగ్ కావడం తెలిసిందే. ఇక ఈ తాజా ఘటనల వల్ల విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande