దిల్లీ:, 20 జూన్ (హి.స.) ఐదోతరం స్టెల్త్ యుద్ధవిమానాన్ని అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన బృహత్తర ప్రాజెక్టు అమలు ప్రక్రియను భారత్ ప్రారంభించింది. దీనికింద ప్రోటోటైప్లను రూపొందించేందుకు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్లను ఆహ్వానించింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఆమ్కా) అనే ఈ యుద్ధవిమాన ప్రాజెక్టును రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఏడీఏ చేపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ