ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి.. కొనసాగుతున్న కూంబింగ్
రాయ్‌పూర్, , 20 జూన్ (హి.స.) ఛత్తీస్‌గఢ్‌ కాంకెర్ జిల్లాలోని చోటే బెట్టియా పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులు తీవ్ర గాయ పడినట్లు తెలుస్తుంది. శుక్రవారం తె
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి.. కొనసాగుతున్న కూంబింగ్


రాయ్‌పూర్, , 20 జూన్ (హి.స.) ఛత్తీస్‌గఢ్‌ కాంకెర్ జిల్లాలోని చోటే బెట్టియా పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులు తీవ్ర గాయ పడినట్లు తెలుస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున కాంకేర్ జిల్లా అడువుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వారు కూబింగ్ చేపట్టారు.

ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులు జరిపాయి. అయితే మావోయిస్టులు గాయపడడంతో.. అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి కోసం భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో భారీగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో వందలాది మంది మరణించిన సంగతి తెలిసిందే

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande