పాటలీపుత్ర-, 20 జూన్ (హి.స.)ప్రధాని మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు బీహార్. ఒడిశాలో మోడీ పర్యటించనున్నారు. రూ.18,600 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక బీహార్ నుంచి గినియాకు మొట్టమొదటి సారిగా లోకోమోటివ్ ఎగుమతిని ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో భారతీయ రైల్వేలకు అంకితం చేయబడిన మార్హౌరా ప్లాంట్.. ఇప్పుడు అక్కడ తయారు చేయబడిన లోకోమోటివ్ను విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి.
బీహార్లోని సరన్ జిల్లాలోని మార్హౌరా ప్లాంట్లో డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ను నిర్మించారు. ఈ లోకోమోటివ్ను పశ్చిమ ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ గినియాకు పంపనున్నారు. “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవతో నిర్మించారు. మేక్ ఇన్ ఇండియాలో ఇదొక ప్రధాన మైలురాయిగా చెప్పొచ్చు. ఇక బీహార్లోని సివాన్లో రూ.400 కోట్లకు పైగా విలువైన కొత్త వైశాలి-డియోరియా రైల్వేలైన్ను ప్రారంభించనున్నారు. అనంతరంర ముజఫర్పూర్-బెట్టియా మీదుగా పాటలీపుత్ర-గోరఖ్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం రూ.1,800 కోట్లకు పైగా విలువైన ఆరు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను ప్రారంభించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ