దిల్లీ: , 20 జూన్ (హి.స.)ఎన్నికల సరళికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేసి తప్పుడు కథనాలు సృష్టించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితంపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ఆ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ కెమెరా రికార్డింగ్లు, వెబ్కాస్టింగ్, వీడియో ఫుటేజ్లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచించింది. దీనికి సంబంధించి రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు మే 30న లేఖలు పంపగా.. ఆ విషయం తాజాగా బయటికొచ్చింది.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు దశల్లో చేపట్టే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సీసీటీవీ రికార్డింగ్, వెబ్కాస్టింగ్ విధానాలపై ఈసీ ఆ లేఖలో సూచనలు జారీ చేసింది. సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన చట్టాల ప్రకారం.. ఈ రికార్డింగ్లు తప్పనిసరి కానప్పటికీ పారదర్శకత కోసం ఈసీ వీటిని ఓ సాధనంగా వినియోగిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ