హైదరాబాద్, 21 జూన్ (హి.స.)
ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తానే ముందు చెప్పానని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. 'హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ట్యాపింగ్ జరిగింది. ప్రభాకర్రావు చాలా మంది సంసారాలను నాశనం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో ఫోన్ మాట్లాడాలంటేనే భయపడేవాళ్లం. ఫేస్ టైం, సిగ్నల్ యాప్లలోనే ఫోన్ మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్రావును కాపాడే ప్రయత్నాలు చేస్తోంది' అని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్