ప్రతి ఒక్కరూ యోగ తో ఆరోగ్యంగా ఉండవచ్చు.. బండి సంజయ్
కరీంనగర్, 21 జూన్ (హి.స.) ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు 11వ అంతర్జాతీయ యోగా డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారు జామునే యోగ డే వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా
బండి సంజయ్


కరీంనగర్, 21 జూన్ (హి.స.) ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు 11వ అంతర్జాతీయ యోగా డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారు జామునే యోగ డే వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. అలాగే నగర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత, యోగా సాధకులు పెద్ద ఎత్తున ఈ యోగా డే వేడుకలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. యోగా ప్రసిష్ఠతను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాడు. ఏదో ఒక్క రోజు యోగా చేయడం కాదని, ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు నిత్యం యోగాసనాలు చేయాలని గుర్తు చేశారు. అలాగే భారతీయులుగా దేశ ప్రజలు, వారి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నేటి నుంచి యోగా చేయడం అలవాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande