2026 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ను నామినేట్ చేసిన పాకిస్తాన్
న్యూఢిల్లీ, 21 జూన్ (హి.స.) పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ ను 2026 నోబెల్ శాంతి బహుమతికై అధికారికంగా నామినేట్ చేసింది. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాత్మక దౌత్య జోక్యం, కీలక న
పాకిస్తాన్ ట్రంప్


న్యూఢిల్లీ, 21 జూన్ (హి.స.)

పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ ను 2026 నోబెల్ శాంతి బహుమతికై అధికారికంగా నామినేట్ చేసింది. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాత్మక దౌత్య జోక్యం, కీలక నాయకత్వం వహించారని, ట్రంప్ భారత్-పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని నివారించడంలో సహాయపడ్డారని పాకిస్తాన్ పేర్కొంది. ఇటీవల పాక్ ఆర్మీ ఛీఫ్ మున్నీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో.. వైట్హౌస్లో డిన్నర్ కార్యక్రమం ముగిసిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ నామినేషన్ను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ ద్వారా ప్రకటించింది.

అందులో రెండు న్యూక్లియర్ దేశాల (భారత్, పాకిస్తాన్) ల మధ్య ఘర్షణలను తగ్గించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని, 2026 లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ ప్రభుత్వం కోరింది. కాగా కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. తాను ప్రపంచ శాంతి కోసం ఏం చేసిన తనకు నోబెల్ రాదని వ్యాఖ్యనించారు. ఇదిలా ఉంటే ట్రంప్ ను పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ చేయడంపై మిశ్రమ స్పందనలను వస్తున్నాయి. కొందరు దీనిని దౌత్య వ్యూహంగా భావిస్తుండగా, మరికొందరు భారతదేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం గా లేదా ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణ సందర్భంలో వ్యూహాత్మక కదలిక గా చూస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande