దిల్లీ:, 22 జూన్ (హి.స.)ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన 827 మంది భారతీయులను ఆపరేషన్ సింధులో భాగంగా స్వదేశానికి చేర్చినట్లు విదేశీ వ్యవహారాలశాఖ శనివారం వెల్లడించింది. ఇరాన్లోని భారతీయ విద్యార్థులు, యాత్రికులతో సహా 290 మంది శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నారని, శనివారం రెండు విమానాల్లో మరో 537 మంది భారత్లో దిగారని వెల్లడించింది. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ తరలిస్తున్నట్లు విదేశీ వ్యవహారాలశాఖ వెల్లడించింది.
2
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ