ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు – మూడు అణు కేంద్రాలు ధ్వంసం
టెహ్రాన్‌: 22 జూన్ (హి.స.) ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్‌పై బీ-2 స్పిరిట్‌ బాంబుల తో విరుచుకుపడింది. మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్‌ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్‌, ఇస్ఫహాన్‌ అణుకేంద్రాలపై భారీ దాడులకు
ఇరాన్ యుద్ధం


టెహ్రాన్‌: 22 జూన్ (హి.స.)

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్‌పై బీ-2 స్పిరిట్‌ బాంబుల తో విరుచుకుపడింది. మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్‌ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్‌, ఇస్ఫహాన్‌ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ‘ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై మేము విజయవంతంగా దాడులు చేశాం. వాటిలో ఫార్దో, నంతాజ్‌, ఇస్ఫహాన్‌ కూడా ఉన్నాయి. ఫోర్డో పై భారీ బాంబులు వేశాం. ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా సైనికులకు అభినందనలు అని తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో పోస్టు చేశారు..అమెరికా దాడులను ఇరాన్‌ కూడా ధ్రువీకరించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande