అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు
టెహ్రాన్‌:, 22 జూన్ (హి.స.)ఇరాన్‌పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్‌.. ఇజ్రాయెల్‌ను టార్గెట్‌ చేసింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, టెలీ అవీవ్‌, ఇతర ప్రాంతాలను టార్గెట్‌గా ఇరాన్‌ భా
అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు


టెహ్రాన్‌:, 22 జూన్ (హి.స.)ఇరాన్‌పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్‌.. ఇజ్రాయెల్‌ను టార్గెట్‌ చేసింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, టెలీ అవీవ్‌, ఇతర ప్రాంతాలను టార్గెట్‌గా ఇరాన్‌ భారీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో, టెలీ అవీవ్‌ సహ దాదాపు 400 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. మరోవైపు.. తమపై దాడి చేసి అమెరికా అతి పెద్ద నేరం చేసిందని ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఇక, ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్‌ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande