మహిళలు ఒంటరిగా ఇండియాకు వెళ్లొద్దు.. అక్కడ రేప్లు ఎక్కువైపోయాయ్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, 22 జూన్ (హి.స.) భారత్ పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. భారత సంస్కృతిని అవమానించేలా లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈనెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల విడుదల చేశారు. ఇండియాలో రేప్ లు, హింసాత్మక ఘటనలు జర
ట్రంప్


హైదరాబాద్, 22 జూన్ (హి.స.)

భారత్ పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. భారత సంస్కృతిని అవమానించేలా లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈనెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల విడుదల చేశారు. ఇండియాలో రేప్ లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి... ఇండియాకు వెళ్లే మహిళలు, యువతులు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రకటనలో హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో అత్యాచారాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అక్కడ ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ముఖ్యంగా కొన్ని పర్యాటక కేంద్రాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఒంటరిగా ప్రయాణించకూడదు. మహిళలైతే అసలు ఒక్కరే వెళ్లకూడదని ట్రంప్ స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande