కామారెడ్డి, 23 జూన్ (హి.స.) కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సోమవారం వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం, విద్యాబోధన అందుతుందా అని విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బీర్కూర్ మండల కేంద్రంలో గల మహాత్మాగాంధీ జ్యోతిబా పూలె బీసీ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించనున్న మరుగుదొడ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..