ఏపీలో. ఆర్జీయూకేటీ పీయూసీ సెలెక్టి .జాబితా విడుదలైంది
అమరావతి, : ఏపీలో ఆర్జీయూకేటీ పీయూసీ సెలక్షన్‌ జాబితా విడుదలైంది. ఈ జాబితాను మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ( ఆధ్వర్యంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు (నూజివీడు, ఆర్‌కే వ్యాలీ,
ఏపీలో. ఆర్జీయూకేటీ పీయూసీ  సెలెక్టి .జాబితా విడుదలైంది


అమరావతి, : ఏపీలో ఆర్జీయూకేటీ పీయూసీ సెలక్షన్‌ జాబితా విడుదలైంది. ఈ జాబితాను మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ( ఆధ్వర్యంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు (నూజివీడు, ఆర్‌కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం)లో పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి మొత్తంగా 50,541మంది దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఈ ప్రొవిజినల్‌ జాబితాలో 4040 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని (ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహా) వెల్లడించారు.

ఎంపికైన వారిలో 94.78 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కాగా.. 5.22శాతం మంది ప్రైవేట్‌ స్కూల్స్‌కు చెందినవారు ఉన్నారన్నారు. వీరిలో 69.01శాతం బాలికలు కాగా.. 30.99శాతం మంది బాలురు ఉన్నట్లు లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రొవిజినల్‌ సెలక్షన్‌ లెటర్‌ను అధికారిక వెబ్‌సైట్‌ https://www.rgukt.in/ లేదా మనమిత్ర 9552300009 వాట్సప్‌ నంబర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande