తెలంగాణ, కామారెడ్డి. 23 జూన్ (హి.స.) బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ప్రమాద సంఘటనలో
ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఘని (30) అనే వ్యక్తి తన కిరాణా షాపులో విక్రయించేందుకు సామాన్ల కోసం వెళ్తుండగా మార్గమధ్యలో సుల్తాన్ నగర్ గ్రామం వద్ద ప్రమాదవశాత్తు టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో చెట్టును ఢీ కొన్నాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. భార్య షహనాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు