దిల్లీ, 24 జూన్ (హి.స.)
: ‘ఆపరేషన్ సింధు ’లో భాగంగా ఇరాన్ నుంచి 10మంది ఏపీ విద్యార్థులు దిల్లీ చేరుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల దృష్ట్యా విదేశాంగశాఖ భారత్కు తీసుకొస్తోంది. ఇరాన్, ఇజ్రాయిల్ నుంచి వచ్చే బాధితుల కోసం దిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు ప్రభుత్వాలు దిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్లలో ఏర్పాట్లు చేశాయి. దిల్లీ నుంచి స్వస్థలానికి పంపేందుకు రెసిడెంట్ కమిషనర్లు 2 టీమ్లను నియమించారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన విదేశాంగ శాఖ ఇప్పటి వరకు దాదాపు 1750 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ