దేశవ్యాప్తంగా ముందుగానే నైరుతి విస్తరణ.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
అమరావతి, 24 జూన్ (హి.స.) దేశంలో నైరుతి రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నాయని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలో నైరుతి దేశమంతా పూర్తిగా విస్తరించే సాధారణ తేదీ జులై 8 కాగా.. ఈ సారి కాస్త ముందుగానే వ్యాపించే అవకాశాలు ఉన్నాయని భారత వాతా
దేశవ్యాప్తంగా ముందుగానే నైరుతి విస్తరణ.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు


అమరావతి, 24 జూన్ (హి.స.)

దేశంలో నైరుతి రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నాయని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలో నైరుతి దేశమంతా పూర్తిగా విస్తరించే సాధారణ తేదీ జులై 8 కాగా.. ఈ సారి కాస్త ముందుగానే వ్యాపించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో పశ్చిమ మధ్య, సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం సహా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం(జూన్ 27) ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే, ఇవాళ(మంగళవారం) సముద్రంలో అలజడి ఏర్పడనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

అలాగే, రేపటి నుంచి వాయువ్య భారతదేశంలో వర్షపాతం గణనీయంగా పెరుగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ ప్రాంతం అంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్య, తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో కూడా రాబోయే ఏడు రోజులలో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 25 నుంచి జులై 2 తేదీలలో పశ్చిమ మధ్యప్రదేశ్‌లో అతి భారీ వర్షపాతం(24 గంటల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువ) ఉంటుందని అంచనా.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande