ఇంటర్మీడియట్ విద్యాశాఖ పై.అవినీతి.ఆరోపణలు
అమరావతి, 25 జూన్ (హి.స.) :ఇంటర్మీడియట్‌ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్‌ చేశారనే అంశం ఏసీబీ విచారణకు దారితీసింది. తాజాగా కమిషనరేట్‌లోని ఓ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. ఇంటర్
ఇంటర్మీడియట్ విద్యాశాఖ పై.అవినీతి.ఆరోపణలు


అమరావతి, 25 జూన్ (హి.స.) :ఇంటర్మీడియట్‌ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్‌ చేశారనే అంశం ఏసీబీ విచారణకు దారితీసింది. తాజాగా కమిషనరేట్‌లోని ఓ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. ఇంటర్‌ విద్యాశాఖలో ఇటీవల పలువురికి పదోన్నతులు ఇచ్చారు. దీనికోసం ఓ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి నగదు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. బోధనేతర ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ దివ్యాంగ ఉద్యోగి లైబ్రేరియన్‌ నుంచి సదరు సూపరింటిండెంట్‌ రూ.లక్ష డిమాండ్‌ చేశారని తెలిసింది. దీనిలో భాగంగా తొలుత రూ.15 వేలు గూగుల్‌ పే ద్వారా తన ఖాతాలో వేయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయినా పదోన్నతి రాకపోవడంతో ఆ ఉద్యోగి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆ ఉద్యోగి తన సమస్యతోపాటు ఇతరుల ముడుపుల విషయాన్ని కూడా ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande